ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ రాజకీయం రాష్ట్ర ప్రజలకు రుచించడంలేదు : మంత్రి రాజా

ABN, First Publish Date - 2022-08-17T06:54:39+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయం రాష్ట్రం లో ప్రజలకు రుచించడంలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని, ఆగస్టు 16: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయం రాష్ట్రం లో ప్రజలకు రుచించడంలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా ఆయనకు కొమ్ముకాయడానికే జనసేన పార్టీ స్థాపించారన్నారు. పవన్‌ చేస్తున్న విన్యాసాలు ప్రజాభిస్టానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. జగన్‌పై ద్వేషం, అసూయతో పవన్‌ రగిలిపోయి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారన్నారు. కులాల మధ్య కుమ్ములాట పెట్టేందుకే హైదరాబాద్‌ నుంచి అప్పడప్పుడు ఏపీకి వస్తారని రాజా అన్నారు. కాపుల్లో కొంతమందిని యువకులను మభ్యపెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఓట్లు చీలకుండా షణ్ముఖ వ్యూహం పన్నుతానని చెప్పి, చంద్రబాబు వ్యూహాన్ని అమలుచేసేందుకు పవన్‌ సిద్ధంగా ఉన్నారని రాజా విమర్శించారు.



Updated Date - 2022-08-17T06:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising