పాశర్లపూడిలంకలో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2022-06-10T06:38:13+05:30
పాశర్లపూడిలంకలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. పాశర్లపూడిలంకలో ఒక తాటాకు ఇంటిలో బొంతు భాస్కరరావు, అతడి భార్య మహాలక్ష్మి, కుమారుడు రామకృష్ణ, కోడలు రాజేశ్వరి, మనుమలు శ్రావ్య, సిద్దు నివాసం ఉంటున్నారు.
మామిడికుదురు, జూన్ 9: పాశర్లపూడిలంకలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. పాశర్లపూడిలంకలో ఒక తాటాకు ఇంటిలో బొంతు భాస్కరరావు, అతడి భార్య మహాలక్ష్మి, కుమారుడు రామకృష్ణ, కోడలు రాజేశ్వరి, మనుమలు శ్రావ్య, సిద్దు నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఆ ఇంటికి నిప్పు అంటుకుంది. ఆ ఇల్లు దగ్ధమవుతున్న విషయాన్ని ఎదురింటి వారు గమనించి ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సర్వంకోల్పోయి ఉమ్మడి కుటుంబం రోడ్డున పడింది. ప్రమాదం ఎలాజరిగిందో ఇంకా తెలియలేదు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో అతికష్టం మీద సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.3లక్షలుఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు.
Updated Date - 2022-06-10T06:38:13+05:30 IST