మహారాష్ట్ర పీసీసీ రిటర్నింగ్ అధికారిగా పళ్లంరాజు
ABN, First Publish Date - 2022-01-29T06:53:21+05:30
ఆర్గనైజేషనల్ ఎలక్షన్- 2022 నిర్వహించడానికిగాను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజును నియమించారు.
కాకినాడ సిటీ, జనవరి 28: ఆర్గనైజేషనల్ ఎలక్షన్- 2022 నిర్వహించడానికిగాను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజును నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాం గ్రెస్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ అధారి టీ చైర్మన్, మాజీ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ శుక్రవారం నియామకపత్రం జారీ చేశారు. ఈమేరకు సభ్యత్వ నమోదును పర్యవేక్షించడానికి, పూర్తి సమాచారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీకి పంపేలా చూడాలని ఆ నియామక పత్రంలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మీకు కేటాయించిన రాష్ట్రానికి వెళ్లి షెడ్యూల్ ప్రకారం ఎన్నికల వివిధ దశలను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Updated Date - 2022-01-29T06:53:21+05:30 IST