ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-03-04T06:16:55+05:30

మండలంలో గోదావరిలో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, మార్చి 3: మండలంలో గోదావరిలో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. దేవీపట్నం మండలం నేలకోటకు చెందిన వల్ల శ్రీనివాసరెడ్డి(32) పురుషోత్తపట్నం తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్‌ వర్కర్‌గా పనిచేసేవాడు. ఈ నెల ఒకటిన మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పట్టిసీమ వీరభద్రుని దర్శనానికి బయలుదేరాడు. పురుషోత్తపట్నం-రామచంద్రపురం మధ్య అనధికార రేవు నుంచి గోదావరిలోకి దిగి ఈదుతూ వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రెండో రోజైన గురువారం రెవెన్యూ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో గోదావరిలో పడవలపై గాలించగా పురుషోత్తపట్నం-రామచంద్రపురం మధ్య గోదావరిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌ఐ శుభశేఖర్‌ తరలించారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా శ్రీనివాసరెడ్డికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు.

Updated Date - 2022-03-04T06:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising