కొవ్వూరులో రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి
ABN, First Publish Date - 2022-05-16T06:37:40+05:30
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ రైల్వే అధికారులకు లేఖ రాసినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఆదివారం తెలిపారు.
రైల్వే అధికారులకు లేఖ రాసిన హోం మంత్రి వనిత
కొవ్వూరు, మే 15 : కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ రైల్వే అధికారులకు లేఖ రాసినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఆదివారం తెలిపారు. కొవ్వూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే 17 రైళ్లకు, విజయవాడ వైపు వెళ్లే 16 రైళ్లను కొవ్వూరు స్టేషన్లో నిలుపుదల చేయాలని, తత్కాల్ బుకింగ్ సేవలను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ను రాతపూర్వకంగా కోరినట్టు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా పలు రైళ్ల హాల్ట్ను నిలుపుదల చేశారన్నారు. కొవిడ్ ఉధృతి తగ్గినా కొవ్వూరులో మాత్రం రైళ్లను పునరుద్ధరించలేదన్నారు.కొవ్వూరులో రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో కొవ్వూరు, గోపాలపురం, పోలవరం మూడు నియోజకవర్గాల ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మేరకు కొవ్వూ రులో రైళ్లను నిలుపుదల చేయాలన్నారు.
Updated Date - 2022-05-16T06:37:40+05:30 IST