ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-03T06:13:04+05:30

అప్పుల బాధ తాళలేక పర్లోవపేటలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్లోవపేట రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పినపోతు మణికుమార్‌కు(33) భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, జనవరి 2: అప్పుల బాధ తాళలేక పర్లోవపేటలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్లోవపేట రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పినపోతు మణికుమార్‌కు(33) భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. పోర్టులో కూలి పనికి వెళుతూ జీవనం సాగించేవాడు. మద్యం అలవాటు ఉండడంతో పాటు అప్పులు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పక్కగదిలో పడుకున్నాడు. మరో గదిలో నిద్రిస్తున్న భార్య, పిల్లలు ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని వేళాడుతూ కనిపించాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. కాకినాడ పోర్టు సీఐ రామ్మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Updated Date - 2022-01-03T06:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising