పారదర్శకంగా సమగ్ర భూసర్వే
ABN, First Publish Date - 2022-01-20T05:12:34+05:30
పిఠాపురం రూరల్, జనవరి 19: సమగ్ర భూ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. మండలంలోని రాపర్తి గ్రామంలో డ్రోన్ల ద్వారా జరుగుతున్న రీసర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. అన్ని భూముల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా
కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ
పిఠాపురం రూరల్, జనవరి 19: సమగ్ర భూ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. మండలంలోని రాపర్తి గ్రామంలో డ్రోన్ల ద్వారా జరుగుతున్న రీసర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. అన్ని భూముల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలన్నారు. అంతకుముందు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించిన ఇల్లింద్రాడ గ్రామానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల నిర్వహణను ఆయన మాధవపురం గ్రామ సచివాలయంలో ప్రారంభించారు. ఆర్డీవో వెంట పిఠాపురం తహశీల్దార్ వరహాలయ్య, సర్వేయర్ సత్యనారాయణ తదితరులున్నారు.
Updated Date - 2022-01-20T05:12:34+05:30 IST