గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తవ్వాలి: జేసీ
ABN, First Publish Date - 2022-01-29T05:37:25+05:30
పిఠాపురం రూరల్, జనవరి 28: గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. మండలంలోని కుమారపురం జగనన్న కాలనీని ఆయన శుక్రవారం పరిశీలించారు. గృహనిర్మాణాలపై ఆరా తీశారు. ఇప్పటికే కొన్ని గృహనిర్మా
పిఠాపురం రూరల్, జనవరి 28: గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. మండలంలోని కుమారపురం జగనన్న కాలనీని ఆయన శుక్రవారం పరిశీలించారు. గృహనిర్మాణాలపై ఆరా తీశారు. ఇప్పటికే కొన్ని గృహనిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు జరిగాయని, ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ప్రారంభించేలా చూడాలని జేసీ సూచించారు. లేఅవుట్లో అంతర్గత రహదారుల అభివృద్ధితో ఇతరత్రా పనులపై సూచనలు చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, తహశీల్దార్ వరహాలయ్య,హౌసింగ్ ఏఈ సత్యనారాయణ ఉన్నారు.
Updated Date - 2022-01-29T05:37:25+05:30 IST