మొక్కలపై మిడతల దాడి
ABN, First Publish Date - 2022-08-20T05:59:11+05:30
పిఠాపురం పట్టణంలో మొక్కలపై మిడతల దండు ఒక్కసారిగా దాడి చేసింది. జిల్లేడు మొక్కలతో పాటు పలు రకాలపై మిడతలు వాలి వాటి ఆకులను తినివేశాయి.
పిఠాపురం, ఆగస్టు 19: పిఠాపురం పట్టణంలో మొక్కలపై మిడతల దండు ఒక్కసారిగా దాడి చేసింది. జిల్లేడు మొక్కలతో పాటు పలు రకాలపై మిడతలు వాలి వాటి ఆకులను తినివేశాయి. పదుల సంఖ్యలో మిడతలు ఒకేసారి రావడంతో పలు ప్రాంతాల్లో మొక్కలు మోడుతో మిగిలాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ విధంగా దాడి చేశాయి. కెలోట్రోపిస్ గ్రాస్హోపర్స్గా పిలవబడే ఈ మిడతలు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటూ జిల్లేడు ఆకులను తింటూ జీవనం సాగిస్తాయని పిఠాపురం వ్యవసాయాధికారి అచ్యుతరావు తెలిపారు. వీటి వలన వరి ఇతర వ్యవసాయ పంటలకు ఏ విధమయిన నష్టం ఉండదని స్పష్టం చేశారు.
Updated Date - 2022-08-20T05:59:11+05:30 IST