భర్త ఫోన్ తీయలేదని మహిళ ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-24T07:05:55+05:30
అత్యవసర సమయంలో భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని మనస్తాపంతో ఓ మహిళ పురుగులు మందు తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రి లో మృతి చెందింది.
అంబాజీపేట, జనవరి 23: అత్యవసర సమయంలో భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని మనస్తాపంతో ఓ మహిళ పురుగులు మందు తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రి లో మృతి చెందింది. తన అమ్మమ్మ మృతి చెందిన విషయాన్ని ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త పట్టెం సూర్యప్రకాష్కు తెలియజేసేందుకు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన పట్టెం సత్యమణి(36) ఫోన్ చేసింది. అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఈ నెల 19న పురుగుమందు తాగింది. దీంతో ఆమెను స్థానికులు అమలాపురం ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది. తల్లి తానేపల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ తెలిపారు.
Updated Date - 2022-01-24T07:05:55+05:30 IST