ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంద కిలోల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-28T05:11:37+05:30

చింతూరు పోలీసులు గురువారం వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో గురువారం ఏఎస్పీ కృష్ణకాంత్‌ వివరాలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతూరు, జనవరి 27: చింతూరు పోలీసులు గురువారం వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో గురువారం ఏఎస్పీ కృష్ణకాంత్‌ వివరాలు తెలిపారు. విజయవాడకు చెందిన అల్లంశెట్టి శోభన్‌బాబు, విశాఖ జిల్లా కొంగపాకలకు చెందిన కొర్ర మాణిక్యం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంగారుచెలకకు చెందిన కరణం అంజయ్య, కొత్తగూడానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌, రమణశెట్టి సందీప్‌ కుమార్‌, జీకే వీధికి చెందిన పొంగిసుక్కు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారిలో కొంతమంది పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంటారు. గంజాయి తరలింపునకు ఒక వ్యాన్‌ కేటాయించుకుని దానిలో ప్రత్యేక అర ఏర్పాటు చేశారు. ఆ అరలో రూ.10 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని తరలిస్తున్నారు. వాహన తనఖీల్లో భాగంగా చింతూరు పోలీసు స్టేషను ఎదుట వీరు పోలీసులకు దొరికిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు గంజాయి తరలింపునకు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు వినియోగించిన రెండు మోటారు సైకిళ్లతో పాటు ఏడు సెల్‌ ఫోన్లు, రూ.4,500 నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising