విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో
ABN, First Publish Date - 2022-01-29T05:31:23+05:30
ఎటపాక విలీన మండలాల్లో రోజురోజుకు అప్ర కటిత విద్యుత్కోత లకు నిరసనగా ఎటపాక గ్రామం లో సీపీఎం ఆధ్వర్యంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు.
ఎటపాక, జన వరి 28: ఎటపాక విలీన మండలాల్లో రోజురోజుకు అప్ర కటిత విద్యుత్కోత లకు నిరసనగా ఎటపాక గ్రామం లో సీపీఎం ఆధ్వర్యంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ సమ స్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి ఐ.వీ మాట్లాడుతూ నిత్యం ఏదొక వంకతో కరెంట్ తీసేస్తు న్నారని, శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించడంలేదన్నారు. విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కరెంట్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయన్నారు. ఇంకా తెలంగాణ నుంచి విద్యుత్ వాడుకోవడం మన పాలకుల నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు కరెంటు సమస్యనున పరిష్కంచాలని కోరారు. కార్యక్రమంలో డేగల మాధవరావు, ఆకిశెట్టి రాము, ఐ.పద్మ, గ్రామస్థులు పాల్గొన్నారు. ఎస్ఐ పార్ధసారధి వచ్చి రాస్తారోకో విరమించాలని కోరగా విద్యుత్ కోతల సమస్యపై హామీ ఇస్తేనే విరమిస్తామన్నారు.
Updated Date - 2022-01-29T05:31:23+05:30 IST