చంద్రబాబు పాలనలోనే ఎస్సీలకు న్యాయం
ABN, First Publish Date - 2022-07-01T06:42:12+05:30
చంద్రబాబు పాలనలో మాత్రమే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కాన్నారు.
ఉప్పలగుప్తం, జూన్ 30: చంద్రబాబు పాలనలో మాత్రమే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కాన్నారు. ఎస్సీ ఓట్లతో నెగ్గిన జగన్ ఎస్సీల నోట మట్టి కొట్టారని ఆరోపించారు. గురువారం ఎన్.చెల్లయ్యనాయుడు అధ్యక్షతన చల్లపల్లి పంచాయతీ చిం తలచెరువులో జరిగిన టీడీపీ సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ కార్పొరేషన్ రుణాలు లేకుండా, ఎస్సీసబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం ద్వారా తీవ్ర అన్యాయం జరిగిందన్న విషయాన్ని ఎస్సీలు గుర్తించారన్నారు. అందుకే ఎస్సీలు చంద్రన్న పాలనను కోరుకుంటున్నారన్నారు. ఐదుఎస్సీ పేటల కార్యకర్తలు పాల్గొన్న సమావేశంలో సభ్యత్వాల నమోదుపై చర్చ జరిగింది. ఇంటర్నెట్ అంతరాయంతో నిలిచిన నమోదు ను వేగవంతం చేస్తామని కార్యకర్తలు పేర్కొన్నారు. పార్టీ గ్రామ కార్యదర్శి బూసి బుజ్జిదొర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలశాఖ అధ్యక్షుడు అరిగెల నానాజీ, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ బీర ధనుంజయరావు, బూసి సోమన్న, బుంగ పండు, జనిపెల్ల నాగరాజు, పల్లి జేమ్స్, మాదే పెద్దిరాజు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-01T06:42:12+05:30 IST