ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కేంద్ర బృందం రాక

ABN, First Publish Date - 2022-08-10T05:50:09+05:30

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతూరు, ఆగస్టు 9: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రానుంది.  కేంద్ర బృందంలోని సభ్యులు ఉదయం ఎనిమిది గంటలకు విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు రంపచోడవరం చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చింతూరు చేరుకుంటారు. 1.30 నిమిషాల నుంచి 2.30 నిమిషాల వరకు భోజన విరామం. 2.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు కూనవరం మండలం, పెద్ద ఆర్కూరు, చిన్నఆర్కూరులో వరద నష్టం వివరాలను బాధితుల నుంచి సేకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు కూనవరం మండలం కోండ్రాజుపేట, శబరి కొత్తగూడెం చేరుకుని అక్కడి పరిస్థితిని అంచనా వేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 5.30 నిమిషాలకు వరరామచంద్రపురం మండలంలోని వడ్డిగూడెం, రాజుపేట, రేఖపల్లి చేరుకుని బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం 6.30 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని రాత్రికి బస చేస్తారు.

Updated Date - 2022-08-10T05:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising