సత్యదేవుడికి కలెక్టర్ ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2022-07-04T06:57:38+05:30
అన్నవరం, జూలై 3: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఆదివారం జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా కుటుంబసభ్యులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారికి ఈవో ఎన్.మూర్తి, పండితులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు
అన్నవరం, జూలై 3: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఆదివారం జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా కుటుంబసభ్యులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారికి ఈవో ఎన్.మూర్తి, పండితులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశా రు. కార్యక్రమంలో పీఆర్వో కొండలరావు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ భాస్కరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా జన్మనక్షత్ర పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో ఆయుష్యహోమం ప్రార ంభించి పూర్ణాహుతి గావించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2022-07-04T06:57:38+05:30 IST