70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి: మంత్రి వెల్లంపల్లి
ABN, First Publish Date - 2022-03-12T21:50:46+05:30
విజయవాడ నగరంలోని దుర్గగుడిని రూ.70 కోట్ల నిధులతో అభివృద్ధి
పశ్చిమ గోదావరి: విజయవాడ నగరంలోని దుర్గగుడిని రూ.70 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలో దేవాలయాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రసాద్ స్కీమ్లో జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ప్రణాళికలు రూపొందించారని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-03-12T21:50:46+05:30 IST