సింహం వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి: వెల్లంపల్లి
ABN, First Publish Date - 2022-04-06T21:27:15+05:30
తనపై టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న చేసిన ఆరోపణలకు మంత్రి
అమరావతి: తనపై టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న చేసిన ఆరోపణలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. బుద్దాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సింహం వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని ఆయన అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో బుద్దా వెంకన్న మాట్లాడతారని ఆయన ఆరోపించారు. అవినీతిపై ఆధారాలు ఉంటే చూపించాలని బుద్దాకు మంత్రి వెల్లంపల్లి సవాల్ విసిరారు. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ అన్నారని, పవన్ మరో సమావేశం పెట్టడానికి నెల పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. పవన్లాంటి నాయకుడు ఏపీ ప్రజలకు అవసరం లేదని వెల్లంపల్లి అన్నారు.
కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయ శాఖ ఇస్తే.. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మంత్రి వెల్లంపల్లి పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 1525 కోట్లను వెల్లంపల్లి దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని సీఎం జగన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-04-06T21:27:15+05:30 IST