ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయి: Dhulipalla

ABN, First Publish Date - 2022-07-06T19:25:20+05:30

వైసీపీ(YCP) ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhupalla Narendra) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Guntur : వైసీపీ(YCP) ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhupalla Narendra) పేర్కొన్నారు. రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకొని ఎకారానికి రూ.10 వేలు నష్టపోయారన్నారు. రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. కోపరేటివ్ సొసైటీ బ్యాంకు(Co Operative Society Bank)లో రైతులు డబ్బులు దోచుకున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. కో ఆపరేటివ్ బ్యాంకులో అవినీతిపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు. డైరీ రంగంపై కేంద్ర జీఎస్టీ 5శాతం వేయడం వల్ల పాడి పరిశ్రమ బతికే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల డైరీ రంగం కుదేలవుతుందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-06T19:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising