AP News: బుక్ అడ్జస్మెంట్ సంస్థలుగా కార్పొరేషన్లు: దేవినేని ఉమ
ABN, First Publish Date - 2022-08-18T16:51:20+05:30
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ (BC), ఎస్సీ (ST), ఎస్టీ (SC), మైనారిటీల అభ్యున్నతిని వైసీపీ సర్కార్ గాలికి వదిలేసిందని ఆరోపించారు. టీడీపీ (TDP) హయంలో ఇచ్చిన రుణాలు, ప్రోత్సాహక పథకాలు రద్దు చేసిందన్నారు. బుక్ అడ్జస్ట్మెంట్ సంస్థలుగా కార్పొరేషన్లు మారాయన్నారు. స్వయం ఉపాధి కోసం ఏ వర్గాలకు ఎంత మొత్తం చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Updated Date - 2022-08-18T16:51:20+05:30 IST