రాష్ట్ర ఆదాయాన్ని పతనావస్థకు చేర్చారు: దేవినేని ఉమా
ABN, First Publish Date - 2022-01-11T22:50:21+05:30
ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే అభివృద్ధి మాత్రం దిగిపోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.
అమరావతి: ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే అభివృద్ధి మాత్రం దిగిపోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యోగ, ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. ప్రకృతి ఇచ్చిన ఇసుకనూ సామాన్యులకు అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పతనావస్థకు చేర్చారని చెప్పారు. డ్వాక్రా మహిళలు, విద్యార్దుల సొమ్మునూ లాక్కున్నారని ఆరోపించారు.
Updated Date - 2022-01-11T22:50:21+05:30 IST