ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాల విభజనతో జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కుట్ర: దేవతోటి నాగరాజు

ABN, First Publish Date - 2022-04-06T15:54:22+05:30

జిల్లాల విభజనతో జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో జిల్లాల విభజనతో జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాలు, వాటిలోని సహజ సంపదను బూచిగా చూపి ప్రభుత్వం మరింత అప్పు తెస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి కుయుక్తులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. జిల్లాల విభజన భౌగోళికంగా తలా తోకా లేకుండా చేశారని, ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేపట్టారో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో  శ్రీలంకను చేసేలా ఉన్నాయని, జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని దేవతోటి నాగరాజు కోరారు.

Updated Date - 2022-04-06T15:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising