ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణస్వామి
ABN, First Publish Date - 2022-04-18T15:53:29+05:30
ఉపముఖ్యమంత్రిగా నారాయణస్వామి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.
అమరావతి: ఉపముఖ్యమంత్రిగా నారాయణస్వామి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎక్సైజ్ శాఖలో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్సుమెంట్ విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ... సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామన్నారు. సెబ్, ఎక్సైజ్ శాఖ సహకారం బాగా ఉందని తెలిపారు. తమ శాఖలో చాలా మందిని సస్పెండ్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం చేస్తామని నారాయణ స్వామి స్పష్టం చేశారు.
Updated Date - 2022-04-18T15:53:29+05:30 IST