ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరంట్ల మాధవ్‌పై పరువు నష్టం దావా

ABN, First Publish Date - 2022-08-11T08:07:23+05:30

గోరంట్ల మాధవ్‌పై పరువు నష్టం దావా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రిమినల్‌ చర్యలూ తీసుకోవాలి

హైకోర్టులో కేసు వేయాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ నిర్ణయం

దూషణలపై న్యాయపరమైన చర్యలు


హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్యపదజాలంతో, వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం నుంచి గోరంట్ల మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సహా పలు మీడియా సంస్థలు దీనిపై కథనాలను ప్రసారం చేశాయి. అదేరోజున మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీని అసభ్య పదజాలంతో దూషించారు. బుధవారం మరోసారి ఇదే రీతిలో మాట్లాడారు. దీంతో న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్ణయించుకున్నారు.

Updated Date - 2022-08-11T08:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising