ఈవ్టీజర్ల ఆటకట్టిస్తాం: డీసీపీ జాషువ
ABN, First Publish Date - 2022-04-30T23:38:42+05:30
మైలవరం పోలీస్ స్టేషన్ను డీసీపీ జాషువ సందర్శించారు. ఈ సందర్భంగా జాషువా మీడియాతో మాట్లాడుతూ.. దిశా యాప్ను ప్రతి ఒక్కరూ విధిగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా - మైలవరం: మైలవరం పోలీస్ స్టేషన్ను డీసీపీ జాషువ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జాషువా మీడియాతో మాట్లాడుతూ.. దిశా యాప్ను ప్రతి ఒక్కరూ విధిగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.మహిళల భద్రతకు నిర్ధిష్టమైన ప్రణాళికలు అవసరమన్నారు.మైలవరంలో సీసీ కెమెరాలను మరలా పునరుద్ధరిస్తామని చెప్పారు.ప్రజలకు సరైన సేవలను పోలీస్ వ్యవస్థ అందిస్తుందన్నారు. బస్టాండ్లో విద్యార్థినులను వేధించే ఈవ్టీజర్ల ఆటకట్టిస్తామని హెచ్చరించారు.జూదాలను అరికట్టెందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు డీసీపీ జాషువ తెలిపారు.
Updated Date - 2022-04-30T23:38:42+05:30 IST