కారులోనే అగ్నికి ఆహుతి
ABN, First Publish Date - 2022-05-18T08:39:56+05:30
కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టిన ఘటనలో నలుగురు వ్యక్తులు కారులోనే సజీవ దహనమయ్యారు.
నలుగురు తిరుపతి వాసులు దుర్మరణం
మార్కాపురం, ఎర్రావారిపాలెం, మే 17: కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టిన ఘటనలో నలుగురు వ్యక్తులు కారులోనే సజీవ దహనమయ్యారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంత గా మారాయి. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన బాలాజీ(22), తేజ(23), ఇమ్రాన్(21) స్నేహితులు. గల్ఫ్కు వెళ్లే ప్రయత్నా ల్లో ఉన్న తేజ.. సంబంధిత పత్రాల కోసం తన కుమార్తె, బాలాజీ, ఇమ్రాన్తో కలిసి విజయవాడ బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం(ఏపీ39డీఈ6450)కారుని అద్దెకు తీసుకుని కంభం వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్నారు. మిట్టమీదపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే సాయంత్రం 6 గం టల సమయంలో కారు టైర్ పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి మార్కాపురం వైపు నుంచి చేపల లోడుతో వెళుతున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారు పెట్రోల్ ట్యాంక్ వద్ద మంట లు చెలరేగడంతో తేజ అతని కుమార్తె హాసిని(6) తోపాటు బాలాజీ, ఇమ్రాన్ సజీవ దహనమయ్యా రు. సమాచారం అందుకున్న మార్కాపురం సీఐ ఆంజనేయరెడ్డి, కంభం ఫైరాఫీసర్ దుర్గాప్రసాద్ ఫైరింజన్తో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రాఽథమిక విచారణలో మృతులం తా తిరుపతి వాసులని గుర్తించారు.
Updated Date - 2022-05-18T08:39:56+05:30 IST