ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా: సీపీఐ రామకృష్ణ

ABN, First Publish Date - 2022-03-15T21:15:53+05:30

గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన జనసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీకి గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన జనసేన అధినేత పవన్‌కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. అమిత్ షా డైరెక్షన్‌లో ఆస్తులను అదానికి అప్పగిస్తున్నారన్నారు. మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్‌లో సీఎం జగన్ నడుస్తుంటే...ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నాయకుల్ని అడుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపి నాయకుల డైరెక్షన్‌లో పనిచేస్తున్న జగన్‌ని దించి తనకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని పవన్ అడుగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన పవన్ కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో చేవచచ్చిన నాయకులు ముందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. జగన్ అప్రజాస్వామిక పోకడలపై తాము పోరాడుతున్నామని ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-15T21:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising