జగన్రెడ్డిది కిచెన్ కేబినెట్: సీపీఐ రామకృష్ణ
ABN, First Publish Date - 2022-04-08T20:59:53+05:30
జగన్రెడ్డిది కిచెన్ కేబినెట్ అని సీపీఐ రామకృష్ణ ఎద్దేవా చేశారు.
అమరావతి: జగన్రెడ్డిది కిచెన్ కేబినెట్ అని సీపీఐ రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలతో సహా మంత్రులంతా డమ్మీలేనన్నారు.24 మంది మంత్రులతో సీఎం జగన్ రాజీనామాలు చేయించి అవమానించారని చెప్పారు. జగన్ నియంతృత్వ ధోరణితో ఏకవ్యక్తి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్లో కొత్తగా వచ్చే మంత్రులకు కూడా మొక్కుబడి పదవులేనని అన్నారు. ప్రజాసమస్యలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని రామకృష్ణ ధ్వజమెత్తారు.
Updated Date - 2022-04-08T20:59:53+05:30 IST