ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: పోలవరం నిర్వాసితులకు జగన్ క్షమాపణ చెప్పాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-07-25T15:33:41+05:30

పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం(Polavaram) నిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. గోదావరికి వరదలు పోటెత్తి పోలవరం పరిసర ప్రాంతాలు నీటి మునిగి, నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిర్వాసితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫలితంగా నిర్వాసితులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందిగా కోరుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు పరిహారం ఇచ్చి, పోలవరం పూర్తి చేయడంలో కపట వైఖరి అనుసరించడం శోచనీయమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇళ్లు నిర్మించి పునర్వాసం కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-25T15:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising