ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీల పెంపు సరికాదు: Ramakrishna
ABN, First Publish Date - 2022-01-07T17:17:12+05:30
సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.
అమరావతి: సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హైదరాబాద్ - విజయవాడకు రూ.3వేలు, హైదరాబాద్ - విశాఖకు రూ.5వేలు చార్జీలను వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలను పెంచలేదని తెలిపారు. తెలంగాణ తరహాలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా సాధారణ చార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల దోపిడీని నియంత్రించాలని రామకృష్ణ అన్నారు.
Updated Date - 2022-01-07T17:17:12+05:30 IST