గవర్నర్ వ్యవస్థపై Narayana వివాదాస్పద వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-03-08T18:32:16+05:30
గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుభవంతో కూడిన వ్యక్తులు గవర్నర్గా వస్తే ఆ పదవికి గౌరవం చేకూరాలన్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రికి హెడ్క్లర్క్గా మారారని విమర్శలు గుప్పించారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్కు తప్ప ఎవరికీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్య చాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి వంతపాడారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-03-08T18:32:16+05:30 IST