AP politics: ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది: సాకే శైలజానాథ్
ABN, First Publish Date - 2022-07-30T19:44:39+05:30
ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు.
అనంతపురం: ఏపీ (AP)లో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ (Sake sailajanath)అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో కర్ఫ్యూ పాలన కొనసాగుతోందన్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు. వరద నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. విశాఖ ఉక్కు పోతుంటే ఆపడం చేతకాని వాళ్లు బీజేపీ (BJP), వైసీపీ (YCP) నేతలు అంటూ శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-07-30T19:44:39+05:30 IST