కడప కలెక్టరేట్ ఎదుట TDP నేతల ఆందోళన
ABN, First Publish Date - 2022-06-20T17:47:01+05:30
జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ నేతలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు.
కడప: జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ(TDP) నేతలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. పంటల బీమాలో రైతులకు అన్యాయం జరిగిందని తెలుగు దేశం శ్రేణులు నిరసన చేపట్టారు. పులివెందులకు చెందిన టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా ఒక వర్గానికి మాత్రమే పంటలబీమా వర్తింపచేసిందని.. అర్హులందరికీ న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. కాగా... కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తున్న టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షులు లింగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-06-20T17:47:01+05:30 IST