టికెట్ల ధరలపై కమిటీ వేశాం.. ఇంకా నివేదిక రాలేదు: మంత్రి బొత్స
ABN, First Publish Date - 2022-02-25T21:57:11+05:30
సినిమా టికెట్స్ అంశం ఇంకా కొనసాగుతోంది. ఇదే విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టికెట్ల ధరలపై కమిటీ వేశామని
విజయనగరం: సినిమా టికెట్స్ అంశం ఇంకా కొనసాగుతోంది. ఇదే విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టికెట్ల ధరలపై కమిటీ వేశామని, ఇంకా నివేదిక రాలేదని తెలిపారు. మనం ఒక వ్యవస్థలో ఉన్నాం... దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వ్యక్తుల కోసం కాదు.. ప్రజల కోసం ఆలోచన చేయాలని హితవుపలికారు. టికెట్లు ధరలు నచ్చకపోతే సినిమాను వాయిదా వేసుకోవాలన్నారు. అమరావతి రైతులది రాజకీయ ఉద్యమమని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Updated Date - 2022-02-25T21:57:11+05:30 IST