చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: సీఎం Jagan
ABN, First Publish Date - 2022-01-18T17:58:36+05:30
కరోనా బారిన పడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
అమరావతి: కరోనా బారిన పడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు. ‘‘చంద్రబాబు గారు త్వరగా కోలుకొని, ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆయన కుమారుడు లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-01-18T17:58:36+05:30 IST