Jagan comments: డిప్యూటీ స్పీకర్గా మరో సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం
ABN, First Publish Date - 2022-09-19T18:39:09+05:30
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కొలగట్ల వీరభద్రస్వామి ఎన్నికైనందున ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలియజేశారు.
అమరావతి: ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (AP Assembly Deputy speaker)గా కొలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadraswamy) ఎన్నికైనందున ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అభినందనలు తెలియజేశారు. సభలో సీఎం మాట్లాడుతూ... రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా చట్టసభలకు కొలగట్ల వచ్చారని తెలిపారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న కోన రఘుపతి (Kona Raghupati) రెండున్నర సంవత్సరాలు ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పనిచేశారని... ఇప్పుడు మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్నప్పుడు ఆయన సహృదయంతో అంగీకరించారని సీఎం జగన్ పేర్కొన్నారు.
Updated Date - 2022-09-19T18:39:09+05:30 IST