Nimmala Ramanaidu comments: జగన్ పలికినవన్నీ అసత్యాలే
ABN, First Publish Date - 2022-08-16T18:22:57+05:30
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఆజాదీకా అమృత్ మహోత్సవ (Azadika Amrit Mahotsav) కార్యక్రమంలో జగన్ పలికినవన్నీ అసత్యాలే అని అన్నారు. ‘‘నాన్న తాగితేనే పిల్లవాడికి అమ్మవడి, భర్త తాగితేనే భార్యకు చేయూత, కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్.. ఇదెక్కడి న్యాయం? మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న నీ విశ్వనీయత నేడు ఏమైంది?’’ అంటూ ప్రశ్నించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జగన్ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తూ, మీడియాపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక రద్దుతో భవన కార్మికులను రోడ్డున పడేసి ఉద్ధరించినట్లు మాట్లాడారన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నేడు గౌరవంగా బతకడానికి కారణం చంద్రబాబు అని తెలిపారు. జగన్ ప్రమాణస్వీకారం రోజున పెన్షన్ రూ.3 వేలు చేస్తానని సంతకం పెట్టిన ఫైల్కు నేడు దిక్కులేదని మండిపడ్డారు. 3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంతో విద్యార్థులు కాలువలు, చెరువులు, స్మశానాలు దాటి స్కూళ్లకు వెళ్లాల్సివస్తోందని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-08-16T18:22:57+05:30 IST