ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్‌కు ధైర్యం లేక నన్ను కలవడం లేదు: కేఏ పాల్

ABN, First Publish Date - 2022-07-30T02:15:23+05:30

సీఎం జగన్‌ (CM Jagan)కు ధైర్యం లేక తనను కలవడం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌ (CM Jagan)కు ధైర్యం లేక తనను కలవడం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP)కి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. కాపులు, దళితులను ఎవరూ కొనలేరని జగన్ తెలుసుకోవాలన్నారు. జగన్ తనను కలిస్తే రాష్ట్రానికి రూ.6లక్షల కోట్లు తెస్తా.. లేదంటే తన పాస్‌పోర్టు మీ దగ్గరే పెట్టుకోండని చెప్పారు. తన వాహనాలు సీజ్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో భాగమే తన వాహనాల అడ్డగించారని దుయ్యబట్టారు. చంద్రబాబు (Chandrababu) తనను కలవాలని కబురు పెట్టారని, అయితే సీక్రెట్ మీటింగ్‌లు వద్దని వెళ్లలేదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప.. ఎవరూ ఎదగలేదని కేఏ పాల్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-30T02:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising