Jagan Delhi Tour.. ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
ABN, First Publish Date - 2022-08-21T17:51:45+05:30
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. 7 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ చేరుకుని 1 జన్పథ్ నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అవుతారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupati Murmu), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad)లను మర్యాద పూర్వకంగా కలుస్తారు.
Updated Date - 2022-08-21T17:51:45+05:30 IST