రాష్ట్రాభివృద్ధిపై మోడీతో సీఎం చర్చించారు: ఎంపీ మోపిదేవి
ABN, First Publish Date - 2022-04-08T00:06:05+05:30
రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో సీఎం
ఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించారని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వారినుంచి సానుకూల హామీలను రాబట్టారన్నారు. ఏపీలో చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడుగా ఉండడం దురదృష్టమన్నారు. సలహాలు ఇవ్వకుండా, తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని ఆయన తెలిపారు. అవసరాల మేరకు అప్పులు తీసుకునే అవకాశం మన వ్యవస్థలో ఉందని ఆయన పేర్కొన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం, నేటి జగన్ ప్రభుత్వం మధ్య పోలిస్తే చిక్కుల్లో పడేది టీడీపీయేనని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన అప్పులు, బిల్లులను తమ ప్రభుత్వం క్లియర్ చేస్తోందని ఆయన తెలిపారు.
Updated Date - 2022-04-08T00:06:05+05:30 IST