Srivari Brahmotsavams: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
ABN, First Publish Date - 2022-10-03T13:07:11+05:30
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Srivari Brahmotsavams) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగుతున్నాయి. ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-10-03T13:07:11+05:30 IST