ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిరోజు 10,561 మంది పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2022-03-18T06:52:13+05:30

జిల్లాలో 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌(కార్బీ వ్యాక్స్‌) గురువారం ప్రారంభించారు. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌ యూహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీహరి ప్రారంభించారు.

తిరుమల రెడ్డి నగర్‌ యూహెచ్‌సీలో పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో శ్రీహరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, మార్చి 17: జిల్లాలో 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌(కార్బీ వ్యాక్స్‌) గురువారం ప్రారంభించారు. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌ యూహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీహరి ప్రారంభించారు. పూత్తూరు హైస్కూల్‌లో డీఐవో రవిరాజు పిల్లలకు స్వయంగా వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. 12-14 ఏళ్లు లోపు వారు 1.29 లక్షల మందిని గుర్తించగా.. 1.3 లక్షల డోసుల వ్యాక్సిన్‌ జిల్లాకు వచ్చిందన్నారు. వైద్యరోగ్యశాఖ మార్గదర్శకాలు ప్రకారం 0.5 ఎంఎల్‌ కార్బీ వ్యాక్స్‌ ఫస్ట్‌ డోస్‌గా వేశామన్నారు. 28 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తామన్నారు. తొలిరోజు 10561 మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేశామని, ఎవరికీ, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని వారు చెప్పారు. కార్బీ వ్యాక్స్‌ వందశాతం సురక్షితమేనని, తల్లిదండ్రులు ముందుకు వచ్చి పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని కోరారు. ఎంఈవోలు, ఉపాధ్యాయులు చొరవ తీసుకుని వంద శాతం వ్యాక్సినేషన్‌కు సహకరించాలన్నారు. 

Updated Date - 2022-03-18T06:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising