ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాక ఆలయాభివృద్ధే లక్ష్యం

ABN, First Publish Date - 2022-10-11T06:45:09+05:30

కాణిపాక వరసిద్ధుడి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో రాణాప్రతాప్‌ పేర్కొన్నారు.

బాధ్యతలు తీసుకుంటున్న ఈవో రాణాప్రతాప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన ఈవో రాణాప్రతాప్‌


ఐరాల(కాణిపాకం), అక్టోబరు 10: ఒక సేవకుడిలా పనిచేస్తూ కాణిపాక వరసిద్ధుడి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో రాణాప్రతాప్‌ పేర్కొన్నారు. సోమవారం కాణిపాకానికి వచ్చిన ఆయన తొలుత వరసిద్ధుడిని దర్శించుకున్నారు. అనంతరం కార్యాలయానికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తానన్నారు. ధర్మకర్తల మండలి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయన్ను సన్మానించారు. అభిషేకం టికెట్ల ధర విషయంలో గత ఈవో సురేష్‌బాబుపై వేటుపడిన పడిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-11T06:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising