టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-27T05:29:38+05:30
ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బుధవారం మదనపల్లెలో చోటు చేసుకుంది.
మదనపల్లె క్రైం, జనవరి 26: ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బుధవారం మదనపల్లెలో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బుగ్గకాలువకు చెందిన గురుమూర్తి కుమార్తె శ్రీలేఖ(15)స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతోంది. బుధవారం గణతంత్ర వేడుకలకు పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఇనుపకొక్కీకి చీరతో ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు కుమార్తెను చూసి షాక్కు గురయ్యారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక కుమార్తె మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అయితే శ్రీలేఖ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఎస్ఐ లోకేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-01-27T05:29:38+05:30 IST