ఎస్వీబీసీ సీఈవో బదిలీ
ABN, First Publish Date - 2022-06-29T07:45:39+05:30
టీటీడీ నిర్వహణలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన సీఈవోగా వైవీకే షణ్ముఖ కుమార్ నియమితులు కానున్నారు.
డిప్యుటేషన్పై ఐఎ్ఫఎస్ అధికారి వైవీకే షణ్ముఖ కుమార్ నియామకం
తిరుపతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): టీటీడీ నిర్వహణలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన సీఈవోగా వైవీకే షణ్ముఖ కుమార్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డీఎ్ఫవోగా పనిచేస్తున్న 2017 ఐఎ్ఫఎస్ అధికారి వైవీకే షణ్ముఖ కుమార్ను ప్రభుత్వం డిప్యుటేషన్పై దేవాదాయ శాఖకు కేటాయించింది. తదుపరి ఆయనను ఎస్వీబీసీకి సీఈఓగా నియమించనుంది. కాగా ఇప్పటి వరకూ సీఈవోగా వున్న గేదెల సురే్షకుమార్ను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచీ వెనక్కు తీసుకుని గిరిజన సంక్షేమ శాఖకు డిప్యుటేషన్పై పంపింది. ఆ శాఖలో ఆయన గిరిజన కార్పొరేషన్ ఎండీగా నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2022-06-29T07:45:39+05:30 IST