ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-03-05T06:26:29+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని జీడీనెల్లూరు నియోజవర్గ టీడీపీ కోర్డినేటర్‌ చిట్టిబాబు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న చిట్టిబాబు నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరంగరాజపురం, మార్చి 4: టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతోనే రాష్ట్రాభివృద్ది  సాధ్యమని జీడీనెల్లూరు  నియోజవర్గ టీడీపీ కోర్డినేటర్‌ చిట్టిబాబు అన్నారు.  మండలంలోని ఎగువకమ్మకండ్రిగ, పుల్లూరు, పద్మాపురం పంచాయతీల్లో జరిగిన ఆత్మగౌరవ సభల్లో ఆయన మాట్లాడుతూ...  వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటీకి వెళ్లి వివరించాలన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన తీరని కలగానే మిగిలిందన్నారు.  పార్టీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్‌ నాయుడు ఆధ్వర్యంలో ఎగువకమ్మకండ్రిగ పంచాయతీ, ఎస్టీకాలనీ చెందిన వలంటీర్‌ ఢిల్లీబాబు సహా 12 మంది, పుల్లూరు  ఉప సర్పంచ్‌ లోకేష్‌ రాయల్‌ సహా 12 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మండల తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పుల్లూరు బాబు,  ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు వెంకటాచలం, దాము నాయుడు, కుప్పయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising