ప్రారంభించి ఏడాదైనా...
ABN, First Publish Date - 2022-08-20T06:15:16+05:30
విలేజ్ క్లినిక్ పేరిట రూ.60లక్షలతో భవనాన్ని నిర్మించి ఏడాదవు తున్నా ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. సోమల మండల పరిషత్ ఆవరణలో విలేజ్ క్లినిక్ భవనం ఏడాది క్రితం పూర్తైంది. ఇందులో సేవలందించడానికి ఎంఎల్హెచ్పీని నియమించారు.భవనం తాళాలు తీసిన దాఖలాలు లేవు
విలేజ్ క్లినిక్లో అందని వైద్యసేవలు
సోమల, ఆగస్టు 19: విలేజ్ క్లినిక్ పేరిట రూ.60లక్షలతో భవనాన్ని నిర్మించి ఏడాదవు తున్నా ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. సోమల మండల పరిషత్ ఆవరణలో విలేజ్ క్లినిక్ భవనం ఏడాది క్రితం పూర్తైంది. ఇందులో సేవలందించడానికి ఎంఎల్హెచ్పీని నియమించారు. మంత్రి పెద్దిరెడ్డి గత ఏడాది ఆగస్టు 27న ఈ భవనాన్ని ప్రారంభించారి వెళ్లారు... అప్పటి నుంచి భవనం తాళాలు తీసిన దాఖలాలు లేవు. తమకు వైద్యసేవలు అందడం లేదని పరిసర ప్రాంత ప్రజలు వాపో తున్నారు. దిడ్డివారిపల్లె, మఠంగొల్లపల్లె, బీసీ కాలనీ, చెన్నయ్యగారిపల్లె, మునిరెడ్డిగారిపల్లె, రాజీవ్నగర్ కాలనీ, వడ్డిపల్లె, గన్నావారిపల్లె, భారతంమిట్ట, పాయలవారిపల్లె, రాశెట్టివారిపల్లె తదితర గ్రామీణ ప్రజలకు అందుబాటులో విలేజ్ క్లినిక్ నిర్మించినా ఫలితం లేకపోతోందని గ్రామీణులు వాపోతున్నారు. అధికారులు స్పందించి విలేజ్ క్లినిక్లో వైద్యసేవలు కొన సాగించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - 2022-08-20T06:15:16+05:30 IST