ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-20T05:16:51+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ గోశాలలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.

ఉట్టి కొడుతున్న చైర్మన్‌, ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 19: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ గోశాలలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాణిపాకానికి చెందిన ఎ.ధనంజయయాదవ్‌, ఎస్‌.రాజేంద్రయాదవ్‌ ఉభయదారులుగా వ్యవహరించారు. సంప్రదాయం ప్రకారం ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, సిబ్బంది పూజా సామగ్రిని గోశాలకు తీసుకొచ్చారు. గోవు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ గోవులకు పూజలు చేశారు. గోవులకు అరటి పండు, దాణా, చెరకు ఆకనుఉ భక్తులు పెట్టారు. అనంతరం గోశాల ప్రాంగణంలో ఆలయ చైర్మన్‌, అధికారులు ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనరు కస్తూరి, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, హేమమాలిని, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising