ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసర్వే వేగవంతం చేయాలి - జేసీ

ABN, First Publish Date - 2022-07-05T05:47:04+05:30

జగనన్న భూహక్కు, భూరక్ష రీసర్వే పనులు వేగవంతం చేయాలని జేసీ బాలాజి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), జూలై 4: జగనన్న భూహక్కు, భూరక్ష రీసర్వే పనులు వేగవంతం చేయాలని జేసీ బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ అంశాల పరిష్కారం, రీసర్వే, గోడౌన్ల నిర్మాణాలు, స్పందనపై రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వేగవంతం చేయాలని, ప్రీడ్రోన్‌ సర్వే సమయంలో ప్రభుత్వ భూములను, డీకేటీలను పరిశీలించాలన్నారు. తొలి విడతలో మంజూరైన 30గోదాములు నిర్మాణాలు జరుగుతున్నాయని, రెండోదశలో 29కి గాను 12కి స్థలాలు గుర్తించలేదని వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఓటీఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా రిజిస్ర్టేషన్‌ కాపీలను అందించాలన్నారు. కౌలు రైతులకు ఇచ్చే సీసీఆర్‌సీ కార్డులను అర్హులకు త్వరగా అందజేయాలన్నారు. వివిధ విభాగాల అధికారులు జయరాజ్‌, ఉమాదేవి, దొరసాని, కనకనరసారెడ్డి, మురళీకృష్ణ, రోస్‌మాండ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising