రూ.165 కోట్ల హౌసింగ్ నిధుల విడుదల
ABN, First Publish Date - 2022-01-04T05:17:43+05:30
జిల్లాలో అర్బన్ హౌసింగ్ కింద గృహా నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.165 కోట్లు విడుదల చేసింది.
చిత్తూరు (సెంట్రల్), జనవరి 3: జిల్లాలో అర్బన్ హౌసింగ్ కింద గృహా నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.165 కోట్లు విడుదల చేసింది. గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అర్బన్ హౌసింగ్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి కొనసాగిస్తున్న 30,348 మంది లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.165 కోట్లు మంజూరు చేసింది. గతేడాది డిసెంబరు 10నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా 70,802 మంది లబ్ధిదారులకు రూ.302 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు దశల వారిగా 60,756 మందికి కేంద్రం నుంచి రూ.258 కోట్లు విడుదల చేసింది. కాగా 10,046 మందికి రూ.44 కోట్లు నిధులు రావాల్సి ఉంది.
Updated Date - 2022-01-04T05:17:43+05:30 IST