ప్రత్యేక ప్రతిభావంతులకు విద్యను అందించాలి : కలెక్టర్
ABN, First Publish Date - 2022-05-26T06:41:08+05:30
ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలకు గుర్తించి వారికి అనుగుణంగా విద్యను అందించాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు.
చిత్తూరు (సెంట్రల్), మే 25: ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలకు గుర్తించి వారికి అనుగుణంగా విద్యను అందించాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు. బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విద్యా శాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒక్క రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారా సాధికారిత ఏర్పడుతుందని, ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలకు అనుగుణంగా భవిత కేంద్రాల ద్వారా అవసరమైన వైద్య సేవలతో పాటు విద్యను అందించాలన్నారు. డీఈవో పురుషోత్తం, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డీఆర్డీఏ పీడీ తులసి, ఐసీడీఎస్ పీడీ నాగశైలజ, జెడ్పీ సీఈవో ప్రభాకర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-26T06:41:08+05:30 IST